సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, దివ్యాంగులకు ఉచితంగా సహాయం అందిస్తామని తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దివ్యాంగులు అన్ని రంగాల్లో సకలాంగులతో పోటీపడుతూ రాణిస్తున్నారని ప్రశంసించారు. దివ్యాంగ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.