గోవును సంరక్షించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గోవును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసినివాసు, మందుల నాగరాజు, ద్వారకా రవి పాల్గొన్నారు.