కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రహమాన్ విమర్శించారు. ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు సంఘం జెండాలు శుక్రవారం ఆవిష్కరించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.