సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.