ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ మెదక్ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. సంగారెడ్డిలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ వెరిఫికేషన్
ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్తో ఆర్టీసీ విలీనానికి సంబంధించి చర్చలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు.