సంగారెడ్డిలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి మండలానికి లీగల్ అడ్వైజర్లను నియమిస్తామని తెలిపారు. ప్రజలకు న్యాయం అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు.