రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దివ్యాంగుల పింఛన్ను 5వేలకు పెంచాలని, ప్రభుత్వ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.