దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారిని పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.