జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాంటీన్లో టిఫిన్ రేట్లు తగ్గించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ అనిల్ కుమార్ కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ ఆసుపత్రికి పేద రోగులే, వస్తారని టిఫిన్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.