పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం సరికాదని, స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.