సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా రోహిణి బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన డీఈఓను కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రోహిణి తెలిపారు.