సంగారెడ్డిలోని కేకే భవన్లో మంగళవారం జరిగిన యువ కార్మికుల సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ, నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా యువ కార్మికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఉత్పత్తిలో యువ కార్మికులదే కీలకపాత్ర అని, అయితే పరిశ్రమ యజమానులు తక్కువ వేతనాలు ఇచ్చి వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.