మాతృ మరణాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై నిర్వహించిన ఆడిట్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచే వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.