ఈనెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో, రాజీ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని పోలీసులకు సూచించారు. చిన్నపాటి వివాదాలు, మోటార్ యాక్సిడెంట్ కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య కూడా పాల్గొన్నారు.