తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ ఈనెల 7న ఎంబీ బంకేట్ హాల్లో జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్లీనరీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం హాజరుకానున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.