సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.