సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం దత్తత హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే వారికి దత్తతపై అవగాహన కల్పించేందుకు ఈ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ రత్నం, CWC సభ్యులు వెంకటేశం పాల్గొన్నారు.