సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో గురువారం 'భౌతిక, జీవ శాస్త్ర మోడళ్ల రూపకల్పన'పై విద్యార్థినులకు ప్రాయోగిక శిక్షణతో కూడిన వర్క్ షాప్ నిర్వహించారు. వనరుల వ్యక్తి హేమలత విద్యార్థులకు వినూత్న మోడళ్లను స్వయంగా తయారుచేసే పద్ధతులను వివరించారు. సైన్స్ పట్ల అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధ్యాపకులు తెలిపారు.