పటాన్చెరులోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో వార్షిక క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు కేవలం పోటీలు కాదని, అవి విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, సహనం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.