సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం, మల్కాపూర్ పరిధిలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో హరిత హారం కార్యక్రమం, విద్యార్థి
ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల చైర్మన్ ఆంథోనీ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మారెడ్డి సమక్షంలో
విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. అనంతరం, ఎన్నికలలో పాల్గొంటున్న
విద్యార్థులు తమ గుర్తులు, చేపట్టే పనులను వివరించారు.