ఇప్పలగడ్డ తాండలో శ్రీ పౌరదేవి జగదాంబ ఆలయ వార్షికోత్సవం వైభవం

1174చూసినవారు
ఇప్పలగడ్డ తాండలో శ్రీ పౌరదేవి జగదాంబ ఆలయ వార్షికోత్సవం వైభవం
సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండలం ఇప్పలగడ్డ తాండ గ్రామంలో శ్రీ పౌరదేవి జగదాంబ దేవాలయ 19వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పూజలు, భజనలతో గ్రామం మార్మోగింది. గ్రామ సర్పంచ్ నేనావత్ సోని రాజు మాట్లాడుతూ, అందరి సహకారంతో వేడుకలు ఘనంగా నిర్వహించామని, రామ్ రావు మహారాజ్ బోధనలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. ఆలయ పూజారి బిక్య నాయక్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్