సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద, శ్రీ మోక్ష ఎండోక్రైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకర్స్కు ఉచిత షుగర్
పరీక్షలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా
పరీక్షలు చేయించుకున్న వారికి వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని వివరించి, ఆరోగ్య చిట్కాలను సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యానికి చెందిన దుస హరిబాబు, అజయ్, రమేశ్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.