సంగారెడ్డి జిల్లాలోని 1108 ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.60 కోట్ల పాఠశాల గ్రాంట్ను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. మొదటి విడతగా 50 శాతం నిధులను పాఠశాలల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఈ నిధులను పాఠశాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.