జహీరాబాద్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ సహాయ కేంద్రం

జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ మహమ్మద్ అస్లాం ఫారుకి తెలిపారు. తెలంగాణ దోస్త్ డిగ్రీ నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. గత ఐదేళ్లుగా కళాశాల మంచి ఫలితాలు సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు.
