ఎంపీ సురేష్ షెట్కార్ ఆదేశాల మేరకు కమల్పల్లిలో నూతన సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ మారుతి రావు పటేల్, మాజీ సర్పంచ్ సంగ్రామ్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.