సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల విద్యాధికారి (ఎంఈఓ)గా నర్సింలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఈఓ మానయ్య పదవీ విరమణ పొందడంతో, కర్చల్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న నర్సింలును డీఈఓ వెంకటేశ్వర్లు ఈ పదవిలో నియమించారు. నర్సింలు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.