సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. రెండవ విడత నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు డప్పుచప్పుళ్లతో, టపాసులు పేలుస్తూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సందడితో నామినేషన్ల పర్వం రసవత్తరంగా మారింది.