
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటించిన ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 సిరీస్ షెడ్యూల్ను ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత్లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జనవరి 21న నాగ్పూర్లో తొలి టెస్ట్తో సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్లలో మిగిలిన టెస్టులు జరుగుతాయి. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ, భారత ఏ జట్ల మధ్య మల్టీ ఫార్మాట్ సిరీస్, అలాగే ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టు, పురుషుల అండర్-19 జట్ల మధ్య కూడా సిరీస్లు జరగనున్నాయి.




