జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో సోమవారం గీతా జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీతపై పోటీలు నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో భగవద్గీత పట్ల అవగాహనను పెంచే లక్ష్యంతో జరిగింది.