ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గుడెం పంచాయతీ సర్పంచ్ పదవిని బహిరంగ వేలం వేశారు. ఈ వేలంలో ఏడుగురు అభ్యర్థులు పాల్గొన్నారు. అత్యధికంగా రూ. 20 లక్షలకు ఒక అభ్యర్థి ఈ పదవిని దక్కించుకున్నారు. వేలంలో వచ్చిన నగదును గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ఖర్చు చేయడానికి అంగీకరించారు.