క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ విజయం

65చూసినవారు
క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ విజయం
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్–చిరాగ్‌ శెట్టి సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఖాయ్‌ జింగ్‌ కాంగ్‌–ఆరోన్‌ తాయ్‌ (మలేసియా) ద్వయాన్ని 19–21, 21–17, 21–13తో ఓడించి, ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. 65 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో భారత జంట తొలి గేమ్‌ కోల్పోయినా, ఆ తర్వాత పుంజుకొని వరుసగా గేమ్‌లు గెలుచుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ జోడీ కిమ్‌ వన్‌ హో–సియో సెంగ్‌ జే (దక్షిణ కొరియా)తో తలపడనుంది.

సంబంధిత పోస్ట్