ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) మెయిన్ పరీక్ష
ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 13న మెయిన్స్ పరీక్ష నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలు ఎస్బీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సైకోమెట్రిక్ పరీక్షకు అర్హులైన అభ్యర్థుల రోల్ నంబర్లు ప్రకటించగా, వివరాలు ఎస్ఎంఎస్/ఈమెయిల్ ద్వారా పంపనుంది. మొత్తం 541 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
వెబ్ సైట్: https://sbi.bank.in/web/careers/recruitment-results