పాట్నా రైల్వే స్టేషన్లో రిజర్వ్ సీటు విషయంలో ఓ మహిళా ప్రయాణికుడిని దుర్భాషలాడుతూ ముక్కలు ముక్కలుగా నరికేస్తానని బెదిరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రిజర్వు చేసుకున్న సీటు మీద నుంచి లేవమంటే చంపేస్తానని అనడం ఏంటని సదరు మహిళపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రైల్వే శాఖ స్పందించి బాధితుడిని ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్ పంపాలని కోరింది.