మహారాష్ట్రలో లోకల్ బాడీస్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం శివసేనకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దగ్డు సక్పాల్ ఉద్ధవ్ శివసేనకు రాజీనామా చేసి, వెంటనే ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండే సమక్షంలో ఈ చేరిక జరిగింది, ఆయన స్వయంగా కండువా కప్పి దగ్డు సక్పాల్ను పార్టీలోకి ఆహ్వానించారు.