ఏడేళ్ల బాలుడు సముద్రాన్ని జయించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. జార్ఖండ్లోని రాంచీకి చెందిన ఇషాంక్ సింగ్ శ్రీలంక నుండి ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల ప్రమాదకరమైన పాల్క్ జలసంధిని కేవలం 9 గంటల 50 నిమిషాల్లో ఈది ఆశ్చర్యపర్చాడు. ఈ ఘనతతో 'యంగెస్ట్ స్విమ్మర్'గా యూనివర్సల్ రికార్డ్స్ ఫోరమ్లో చోటు సంపాదించాడు. చిన్న వయసులోనే పట్టుదలతో ఈ సాహసం చేసిన బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.