టాలీవుడ్ నటుడు
చిరంజీవి, కన్నడ నటుడు రాజ్కుమార్ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం కొనసాగుతోంది. వారి వారసులు
రామ్చరణ్, శివరాజ్కుమార్ 'పెద్ది' సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరోయిన్ జాన్వీ కపూర్తో కలిసి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా, రాజ్కుమార్-
చిరంజీవి పాత ఫోటోను చూపించి, దానిని రీక్రియేట్ చేయమని హోస్ట్ కోరగా, శివరాజ్కుమార్ రామ్చరణ్ను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.