చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (2) ను సందీప్ శర్మ బౌలింగ్ (5.3)లో ఔట్ చేయగా, యశస్వి జైస్వాల్ క్యాచ్ పట్టాడు. అనంతరం కార్తిక్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ఆ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోర్ 41/4గా నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించారు.