ఖమ్మం మహిళ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు!

70011చూసినవారు
ఖమ్మం మహిళ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు!
TG: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల (28) ఆత్మహత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నట్లు, సోమవారం పత్తి తీసేందుకు వెళ్లినప్పుడు ఆమెను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి, అత్యాచారం చేసి వదిలేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మనస్తాపంతో సుశీల ఆత్మహత్య చేసుకుందని, అయితే ఆమె ఒంటిపై గాయాలున్నాయని, శవపరీక్షలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.