సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంపై తాజా సమాచారం వెలువడింది. "నేను ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాను, రోజురోజుకూ మెరుగుపడుతున్నాను, మీ నుంచి నాకు లభించిన మద్దతుకు నేను చాలా కృతజ్ఞుడను, నన్ను మీ ఆలోచనల్లో ఉంచుకున్నందుకు ధన్యవాదాలు" అని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. మరో వారం రోజుల్లో
భారత్ కు తిరిగి వచ్చాక ముంబైలో చికిత్స పొందుతారని సమాచారం.