టీమిండియా టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సిరీస్ విజయం సాధించాడు. వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో గిల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి దూరమవడంతో గిల్ నాయకత్వం చేపట్టిన విషయం తెలిసిందే.