కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో
కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుడిగా సిద్ధరామయ్యను నియమించింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేపు డీకే శివకుమార్తో పాటు కనీసం 12 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.