కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సమర్పించారు. ఆయనతోపాటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. నెక్ట్స్ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు.