సిద్దిపేట భూ వివాదంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, బాలాజీ రియల్ ఎస్టేట్ డైరెక్టర్లు పొన్నం పృథ్వీ, అనూప్ కుమార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సామాజికవేత్త చక్రధర్ గౌడ్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రమేయంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర కలకలం సృష్టించింది.