సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన
బీజేపీ నాయకులు హైదరాబాద్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ రుద్రారం యాదగిరి,
బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సిద్దిన రుద్రారం కర్ణాకర్ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గన్నేబోయిన చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.