రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, యోగా శారీరక దృఢత్వాన్ని, ఒత్తిడి తగ్గింపును అందించి విశ్రాంతిని కలిగిస్తుందని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా రత్న ఆచార్య రమేష్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల యోగ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నియంత్రిత శ్వాస, మైండ్ఫుల్నెస్ పద్ధతుల ద్వారా యోగా మనస్సును ప్రశాంతపరుస్తుందని ఆయన తెలిపారు.