మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సిద్దిపేట జిల్లా తొగుట ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు లక్కిరెడ్డి నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.