గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 3న జాబ్ మేళా జరగనుంది. హైదరాబాద్ కు చెందిన కోహన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం 2024, 2025లో బీఎస్సీ (బీజెడ్సీ), బీఎస్సీ (ఎంపీసీ) ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18వేలు వేతనం లభిస్తుంది. మరిన్ని వివరాలకు 9396421849 నంబర్ లో సంప్రదించవచ్చు.