సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఆదివారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరి సత్యనారాయణకు రూ. 28500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగిందని ఆయన అన్నారు.