ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా, బుధవారం హుస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నుండి హైదరాబాద్కు ఎక్స్ ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ ను కూడా ప్రారంభించారు. అనంతరం 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.