హుస్నాబాద్ లో నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు 22 వేల కోట్ల బ్యాంకు అప్పులు ఉంటే కేవలం 6 కోట్ల రూపాయలు కట్టమని చెప్పడంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి మోడీజీ రైతులను,
చిరు వ్యాపారస్తులను చిన్న ఆలస్యానికే జరిమానాలతో వేధిస్తున్నారని, మరి ఈయనకు
బీజేపీ ప్రభుత్వం ఎందుకు పెద్ద ఆఫర్ ఇచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద స్కాం కు పాల్పడ్డ వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.